టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభ మ్యాచ్లో నెదర్లాండ్స్పై పాకిస్తాన్ ఉత్కంఠ విజయం

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్కు శనివారం ఘనంగా తెరలేచింది. శ్రీలంక రాజధాని కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. గ్రూప్ ఏ నుంచి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
నెదర్లాండ్స్ 147 పరుగులకు ఆలౌట్
ముందుగా బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మైకేల్ లెవిట్ 24 పరుగులతో శుభారంభం ఇవ్వగా, బాస్ డీ లీడే 30, కొలిన్ అకెర్మాన్ 20 పరుగులు చేశారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లు పడగొట్టాడు. మొహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీబ్ ఆయుబ్ చెరో రెండు వికెట్లు తీశారు. షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఓపెనర్ల శుభారంభంతో పాకిస్తాన్ చేజ్
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ 31 బంతుల్లో 47 పరుగులు, సయీబ్ ఆయుబ్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చారు. అయితే వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా 12 పరుగులకే ఔట్ అయ్యాడు. బాబర్ ఆజం 15 పరుగులతో నిరాశపరచగా, ఉస్మాన్ ఖాన్ సున్నాకే పెవిలియన్ చేరాడు.
తర్వాత షాదాబ్ ఖాన్ 8, మొహమ్మద్ నవాజ్ 6 పరుగులతో వెనుదిరిగారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ఫాహీమ్ అష్రఫ్ చివరి ఓవర్లలో మెరుపులు
చివరి ఓవర్లలో ఫాహీమ్ అష్రఫ్ మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పాడు. అతడు 11 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతనికి తోడుగా షాహిన్ అఫ్రిది 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో మూడో బంతికి అష్రఫ్ బాదిన ఫోర్తో పాకిస్తాన్ విజయం ఖరారైంది.
పాకిస్తాన్ జట్టు 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి నెదర్లాండ్స్పై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాకిస్తాన్ ఖాతాలో తొలి రెండు పాయింట్లు చేరాయి.
నెదర్లాండ్స్ బౌలర్ల పోరాటం
నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ కీలకంగా బౌలింగ్ చేసి సయీబ్ ఆయుబ్, సల్మాన్ ఆఘా వికెట్లు తీశాడు. పాల్ వాన్ మీకెరెన్ సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్ ఖాన్లను ఔట్ చేశాడు. లోగాన్ వాన్ బీక్, కైలీ క్లెయిన్, వాన్ డెర్ మెర్వె చెరో వికెట్ తీసుకున్నారు.
మరిన్నివార్తలుచదవండి: టీ20 ప్రపంచకప్ 2026 ఈషాన్ మలింగ ఔట్, ప్రమోద్ మదుశన్ శ్రీలంక జట్టులోకి
తరచుగా అడిగే ప్రశ్నలు
పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్పై మూడు వికెట్ల తేడాతో గెలిచింది.
చివరి ఓవర్లలో 29 పరుగులు చేసిన ఫాహీమ్ అష్రఫ్ పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.