‘టూ మచ్ అటిట్యూడ్’ అంటూ వాషింగ్టన్ సుందర్పై సోషల్ మీడియాలో రచ్చ

టీమిండియాలో అప్ కమింగ్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న వాషింగ్టన్ సుందర్, మైదానం వెలుపల తన ప్రవర్తన కారణంగా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల సుందర్ ఒక హోటల్ నుండి బయటకు వస్తుండగా, ఒక యువకుడు ఆటోగ్రాఫ్ అడిగినప్పటికీ నిర్లక్ష్యంగా తిరస్కరించాడు.
అలాగే, కొందరు అభిమానులు సెల్ఫీ కోసం ప్రయత్నించినప్పటికీ, అతను పట్టీపట్టనట్లు స్పందించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోను చూసి నెటిజన్లు సుందర్పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఇప్పుడే ఎదుగుతున్నావా… ఏంటా బలుపు?" అని, అలాగే "నువ్వేమైనా విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మలా ఆలోచిస్తున్నావా?" అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.
Washington Sundar looks like a proper gentleman, but his attitude is on another level — even more than big names like Virat Kohli, Rohit Sharma, and Hardik Pandya. 😅🙏 pic.twitter.com/7lVDBGz66K
— Jara (@JARA_Memer) January 2, 2026
మొత్తానికి, ఆన్ఫీల్డ్లో తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్న సుందర్, ఆఫ్ఫీల్డ్ ప్రవర్తన కారణంగా అదే అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
అయితే, ఇటీవలి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఫార్మాట్లలో సక్సెస్గా రాణించిన సుందర్, త్వరలో న్యూజిలాండ్తో జరగబోయే హోమ్ టీ20 సిరీస్కి సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్లో ఎంపికైన జట్టు, టీ20 ప్రపంచకప్లో కూడా కొనసాగుతుందని సమాచారం. ఇటీవలి కాలంలో సుందర్ ప్లేయింగ్ ఎలెవెన్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించి, ప్రపంచకప్లో ఆడడం కచ్చితంగా ఖాయమని చెప్పవచ్చు.
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జనవరి 21 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే ప్రకటించబడింది. ఐదు మ్యాచ్లు క్రమంగా ఈ తేదీల్లో జరగనుండగా –
జనవరి 21: నాగ్పూర్
జనవరి 23: రాయ్పూర్
జనవరి 25: గౌహటి
జనవరి 28: వైజాగ్
జనవరి 31: తిరువనంతపురం
ఈ సిరీస్కి ముందు, ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా జరుగనుంది, ఇది జనవరి 11 నుండి ప్రారంభం కానుంది. వన్డే జట్టు త్వరలో ప్రకటించబడనుంది.
మరిన్నివార్తలుచదవండి: BAN vs IND: ఆగస్టు సెప్టెంబర్లో బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన షెడ్యూల్ ఖరారు
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ సిరీస్ జనవరి 21 నుండి ప్రారంభమై, జనవరి 31 వరకు జరుగుతుంది.
అవును, ఆటోగ్రాఫ్ ఇవ్వకపోవడం మరియు ఫ్యాన్స్ను నిర్లక్ష్యం చేయడం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.