WPL 2026: మహిళా ఐపీఎల్లో కొత్త జట్టు ఎంట్రీ.. మెగా వేలంలో రికార్డు ధరలకు ప్లేయర్స్!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో జట్ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఐదు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ ఈ లీగ్లో పోటీపడుతున్నాయి. 2023లో ప్రారంభమైన మహిళా ఐపీఎల్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ మూడు సీజన్ల్లో కూడా ఐదు జట్లే పాల్గొన్నాయి. అయితే, రాబోయే సీజన్ నుండి తొలిసారిగా కొత్త జట్టు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
WPL 2026 మెగా వేలం సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ పార్థ్ జిందాల్ ఈ విషయాన్ని బలంగా సూచించారు.
“డబ్ల్యూపీఎల్లో బీసీసీఐ మరో జట్టును జోడించే ఆలోచనలో ఉంది. కొత్త జట్టు వచ్చిన తర్వాత అన్ని ఫ్రాంచైజీలు తమ తమ హోమ్ గ్రౌండ్స్లోనే మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. బోర్డు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఉమెన్స్ వరల్డ్ కప్లో కూడా మ్యాచ్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఈ మార్పులు అవసరం అవుతున్నాయి” అని జిందాల్ స్పష్టం చేశారు.
కొత్త జట్టు విషయంలో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఈ మూడు ఫ్రాంచైజీలలో ఏదో ఒకటి WPLలోకి అడుగుపెట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ విస్తరణ ఐపీఎల్ 2027 సీజన్ నాటికి ఖరారయ్యే అవకాశముంది.
మహిళల ప్రీమియర్ లీగ్ గత రెండు సీజన్లలో అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలోనే బీసీసీఐ జట్ల సంఖ్య పెంపును పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం WPL 2026 టోర్నమెంట్ను నవీ ముంబై, వడోదర ఈ రెండు వేదికలకు పరిమితం చేశారు.
ఇక జరుగుతున్న WPL 2026 మెగా వేలంపై క్రేజ్ భారీగా ఉంది. మొత్తం 277 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో 73 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 194 మంది భారత ఆటగాళ్లు, అందులో 52 మంది క్యాప్డ్, 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు.
ఈ మెగా వేలంలో ఇప్పటివరకు జరిగిన ప్రధాన హైలెట్స్లో
టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ భారీ ధరకు అమ్ముడయింది. యూపీ వారియర్స్ ఆమెను రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేశారు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్లకు తీసుకున్నారు. ఇటీవల బిగ్ బాష్లో సెంచరీతో అదరగొట్టిన మెగ్ లానింగ్ ను రూ. 1.90 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకున్నారు. భారత స్పిన్నర్ శ్రీ చరని ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.30 కోట్లకు తీసుకుంది.
గత సీజన్లో ఆర్సీబీ కోసం ఆడిన సోఫీ డివైన్ ను గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ను యూపీ వారియర్స్ మళ్లీ సొంతం చేసుకోవడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెనర్ లిచ్ఫీల్డ్, భారత్పై వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ఈ స్టార్ బ్యాటర్ను కూడా యూపీ వారియర్స్ రూ. 1.20 కోట్లకు తీసుకుంది.
మరిన్ని వార్తలు చదవండి: WPL 2026 వేలం: అత్యధిక ధరకు అమ్ముడైన టాప్-10 ప్లేయర్లు – పూర్తి వివరాలు
I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.