WPL 2026కు ముందే గుజరాత్ జెయింట్స్కు షాక్.. యస్తిక భాటియా ఔట్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ ప్రారంభానికి గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగానే గుజరాత్ జెయింట్స్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. జట్టు కీలక వికెట్కీపర్–బ్యాటర్ యస్తిక భాటియా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తం ఆటకు దూరమైంది.
గాయం వెంటాడుతూనే ఉంది
యస్తిక భాటియా మోకాలి గాయంతో ఇప్పటికే కొంతకాలంగా బాధపడుతోంది. ఇదే గాయం కారణంగా ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్తో పాటు వన్డే ప్రపంచకప్కు కూడా ఆమె దూరమైంది. ఆ సమయంలో ఆమె స్థానంలో భారత జట్టులోకి ఉమా ఛెత్రిని ఎంపిక చేశారు. డబ్ల్యూపీఎల్ ప్రారంభానికి ముందుగా యస్తిక పూర్తిగా కోలుకుంటుందని భావించినప్పటికీ, ఆమె ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయింది. దీంతో ఈ సీజన్లో ఆమె ఆడటం లేదని స్పష్టమైంది.
గుజరాత్కు డబుల్ షాక్
యస్తిక భాటియా దూరమవడం ఒక పెద్ద దెబ్బ అయితే, ఆమె స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకునే అవకాశం కూడా గుజరాత్ జెయింట్స్కు లేకపోవడం మరో షాక్. బీసీసీఐ నిబంధనల ప్రకారం, వేలానికి ముందే గాయంతో ఉన్న ఆటగాడు సీజన్కు దూరమైతే, అతని స్థానంలో రీప్లేస్మెంట్ను తీసుకునేందుకు అనుమతి ఉండదు. యస్తికను గుజరాత్ జెయింట్స్ రూ.50 లక్షలకు వేలంలో కొనుగోలు చేసిన సమయంలోనే ఆమె గాయంతో ఉన్నారు.
ఇదే నిబంధన ఆర్సీబీ ఆటగాడు పూజా వస్త్రాకర్, యూపీ వారియర్స్ ప్లేయర్ ప్రతిమ రావత్లకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ వీరూ ఫిట్నెస్ సాధించలేకపోతే, ఆయా జట్లు కూడా కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం కోల్పోతాయి.
మొత్తానికి, డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్ జెయింట్స్ కీలక ఆటగాడిని కోల్పోవడంతో జట్టు వ్యూహాలపై ఇది ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తలు చదవండి:
తరచుగా అడిగే ప్రశ్నలు
మోకాలి గాయంతో పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడం వల్ల యస్తిక భాటియా ఈ సీజన్ మొత్తానికి దూరమైంది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.