అన్ని

యాషెస్ సిరీస్ 2025-26: ఓటమి తర్వాత బెన్ స్టోక్స్ వేదన – “మా కల అక్కడితో ముగిసింది”

యాషెస్ సిరీస్ 2025–26లో ఇంగ్లండ్‌కు భారీ నిరాశ ఎదురైంది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే, సిరీస్‌ను 3–0 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్ జట్టు, ఈ పరాజయంతో సిరీస్ ఆశలను పూర్తిగా కోల్పోయింది. 435 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్, చివరకు 352 పరుగులకే ఆలౌట్ అయింది.

లక్ష్య ఛేదనలో ఓపెనర్ జాక్ క్రాలే 85 పరుగులతో అద్భుతంగా పోరాడినా, మిడిల్ ఆర్డర్ నుంచి ఆశించిన స్థాయి సహకారం లభించలేదు. చివర్లో జేమీ స్మిత్ 60, విల్ జాక్స్ 47, కార్స్ 39 నాటౌట్‌తో జట్టును గెలిపించేందుకు శ్రమించారు. అయితే ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్ తలా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖరారు చేశారు.

మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భావోద్వేగంగా మాట్లాడాడు. సిరీస్‌ను ఏదైనా విధంగా కాపాడుకోవాలనే లక్ష్యంతో అడిలైడ్‌కు వచ్చామని, కానీ ఆ కల ఇప్పుడు చెదిరిపోయిందని చెప్పాడు.

ఈ ఓటమి జట్టులోని ప్రతి ఒక్కరినీ ఎంతో బాధకు గురి చేసిందని, ఆటగాళ్లంతా భావోద్వేగంగా ఉన్నారని వెల్లడించాడు. ఆస్ట్రేలియా ప్రదర్శనకు తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలని, గెలుపు అనేది బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే మూడు విభాగాల్లో రాణించడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తమకంటే మెరుగ్గా ఆడిందని, మూడు విభాగాల్లోనూ పైచేయి సాధించిందని స్టోక్స్ అంగీకరించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యం ఉన్నప్పటికీ చివరి వరకు పోరాడామని చెప్పాడు. విల్ జాక్స్, జేమీ స్మిత్ ఆటతీరును చూసి గెలుస్తామని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదని తెలిపాడు.

టాస్ ఓడినప్పటికీ, ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేయగలిగామని, అయితే ఆ తరువాత తామే భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యామని స్టోక్స్ పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 60 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌పై ప్రభావం చూపిందని అన్నాడు. అయినప్పటికీ జట్టులో కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయని తెలిపాడు.

ముఖ్యంగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాట పటిమ నిజంగా ప్రశంసనీయమని, తాను ఆశించిన పట్టుదల వారిలో కనిపించిందని స్టోక్స్ అన్నారు. సిరీస్ కోల్పోయినప్పటికీ, మిగిలిన రెండు టెస్టుల్లో గెలుపు సాధించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామని స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు చదవండి: యాషెస్ 2025 మూడో టెస్ట్ ఆస్ట్రేలియా చేతుల్లో భారీ గెలుపు

తరచుగా అడిగే ప్రశ్నలు

Q. యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ సిరీస్‌ను ఎలా కోల్పోయింది?
A.

ఇంగ్లండ్ అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఓటమి చెందడంతో, సిరీస్‌ను 3-0 తేడాతో ఆస్ట్రేలియాకు కోల్పోయింది.

Q. అడిలైడ్ టెస్టులో ఇంగ్లండ్ అత్యుత్తమ ప్రదర్శన చూపిన ఆటగాళ్లు ఎవరు?
A.

జాక్ క్రాలే (85), జేమీ స్మిత్ (60), విల్ జాక్స్ (47) ముఖ్య ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు, వారు జట్టును పోరాటపూర్వకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

Krishna R
Krishna R

I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.

నవీకరణలు