బంగ్లాదేశ్ క్రికెటర్లు ఐపీఎల్ 2026లో ఆడతారా? బీసీసీఐ స్పష్టత

ఇటీవల భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హత్య అనంతరం ఆ దేశంలో భారత వ్యతిరేక నిరసనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలోనే దాదాపు పది మంది హిందువులపై దాడులు జరగగా, ఢాకాలోని భారత ఎంబసీ కార్యాలయంపై కూడా దాడి జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడతారా లేదా అనే అంశంపై అనిశ్చితి నెలకొంది. బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి నిషేధించాలని భారత్లో పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను భారీ ధరకు కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీతో పాటు ఆ జట్టు ఓనర్ షారుక్ ఖాన్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు హిందూ సంఘాలు షారుక్ ఖాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొనే అంశంపై బీసీసీఐ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. పేరు వెల్లడించని బీసీసీఐ సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు పాల్గొనాలంటే భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఏడుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో కోల్కతా నైట్ రైడర్స్ ఒక ఆటగాడిని కొనుగోలు చేసింది. ఫ్రాంచైజీలు వేలంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లలోంచి ఎంపిక చేసుకుంటాయి.
బీసీసీఐ పూర్తిగా భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే పనిచేస్తుంది. ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిషేధించాలనే ఆదేశాలు ప్రభుత్వంవైపు నుంచి రాలేదు. ఈ అంశం మా పరిధిలో లేదు. ప్రస్తుతం దీనిపై అంతకుమించి వ్యాఖ్యానించలేం’’ అని ఆయన తెలిపారు.
బీసీసీఐ అధికారి వ్యాఖ్యలతో ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టత వచ్చింది. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో, ఈలోపు కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2025 డిసెంబర్ 15న జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ.9 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది.
మరిన్నివార్తలుచదవండి: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీకి అగ్నిపరీక్ష! ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయితేనే టీమిండియా అవకాశం
తరచుగా అడిగే ప్రశ్నలు
లేదు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఐపీఎల్ నిషేధానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.
ఐపీఎల్ 2026 సీజన్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.