హ్యారీ బ్రూక్పై భారీ జరిమానా విధించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
నైట్క్లబ్ ఘటనపై నిజం ఒప్పుకున్న హ్యారీ బ్రూక్, సహచరులను కాపాడేందుకే అబద్ధం

ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. నైట్క్లబ్ ఘటనకు సంబంధించి గతంలో తాను చెప్పిన మాటలు నిజం కాదని, ఆ రోజు అబద్ధం మాట్లాడినట్లు స్వయంగా అంగీకరించాడు. సహచర క్రికెటర్లను వివాదంలోకి లాగకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అలా చేశానని ఆయన స్పష్టం చేశాడు.
నైట్క్లబ్ ఘటనలో హ్యారీ బ్రూక్కు గాయాలు
గత ఏడాది ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మూడో వన్డేకు ముందు రోజు అక్టోబర్ 31 రాత్రి హ్యారీ బ్రూక్ ఒక నైట్క్లబ్కు వెళ్లాడు. లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా మద్యం సేవించాడనే అనుమానంతో అక్కడి బౌన్సర్ అతడిని అడ్డుకున్నాడు. దీనితో మాటల తూటాలు చోటు చేసుకోగా, ఆ సమయంలో బౌన్సర్ బ్రూక్పై దాడి చేశాడని వార్తలు వెలుగులోకి వచ్చాయి.
హద్దులు దాటిన ప్రవర్తనపై క్షమాపణలు
ఈ ఘటన రెండు నెలల తర్వాత యాషెస్ టెస్టు సిరీస్ సమయంలో బయటకు వచ్చింది. అప్పట్లో స్పందించిన హ్యారీ బ్రూక్, “ఆ రోజు నేను హద్దులు దాటి ప్రవర్తించాను. దానికి నేను పూర్తిగా బాధ్యత వహిస్తున్నాను. నా చర్యలు జట్టుకు, దేశానికి ఇబ్బంది కలిగించాయి. కెప్టెన్గా నాకు దక్కిన గౌరవాన్ని కాపాడుకుంటూ ఇకపై ఇలాంటి తప్పులు చేయను” అంటూ క్షమాపణలు తెలిపారు.
ఆ సమయంలో తాను ఒక్కడే నైట్క్లబ్కు వెళ్లినట్లు బ్రూక్ పేర్కొన్నాడు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆయనపై సుమారు ముప్పై మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
జేకబ్ బెతెల్, జోష్ టంగ్ కూడా ఉన్నారు
ఇటీవల టెలిగ్రాఫ్ పత్రిక ఈ ఘటనపై కొత్త వివరాలను వెలువరించింది. బ్రూక్తో పాటు జేకబ్ బెతెల్, జోష్ టంగ్ కూడా ఆ నైట్క్లబ్లో ఉన్నారని, వారికి కూడా జరిమానా విధించబడిందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో విజయం తర్వాత స్పందించిన హ్యారీ బ్రూక్, వెల్లింగ్టన్లో జరిగిన ఘటనకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని తెలిపారు. “ఆ రోజు నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారన్నది నిజమే. గతంలో నేను చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను” అని అన్నారు.
సహచరులను కాపాడేందుకే అబద్ధం
అయితే ఆరోజు సహచర క్రికెటర్లను రక్షించాలనే ఉద్దేశంతోనే అబద్ధం చెప్పానని బ్రూక్ వెల్లడించాడు. “వారిని వివాదంలోకి లాగకూడదనుకున్నాను. అందుకే తప్పు చేశాను. మరోసారి క్షమాపణలు కోరుతున్నాను. ప్రస్తుతం నా కెరీర్లో కఠినమైన, సవాలుతో కూడిన దశలో ఉన్నాను. ఈ అనుభవం నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నాను” అని హ్యారీ బ్రూక్ పేర్కొన్నారు.
మరిన్నివార్తలుచదవండి: మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: ఇండియా ఎ జట్టు, రాధా యాదవ్ కెప్టెన్
తరచుగా అడిగే ప్రశ్నలు
సహచర క్రికెటర్లను వివాదంలోకి లాగకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో అబద్ధం చెప్పినట్లు బ్రూక్ అంగీకరించాడు.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.