భారత్ vs USA U19 వరల్డ్ కప్ 2026: 6 వికెట్లతో టీమిండియా గెలుపు

ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026లో భారత జట్టు విజయవంతమైన ఆరంభం చేసింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో యువ భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే ఆలౌట్ అయింది. పేసర్ హెనిల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటింగ్ను చీల్చి చెండాడాడు. అతడు ఏడు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
హెనిల్కు తోడుగా దీపేష్, అభ్రిష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలా ఒక వికెట్ తీశారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడటంతో, భారత్ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులుగా సవరించారు.
సవరించిన లక్ష్యాన్ని భారత జట్టు 17.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి సులువుగా చేధించింది. వైభవ్ సూర్యవంశీ, అయూష్ మాత్రే, త్రివేది తక్కువ స్కోర్లకే ఔటైనా, వికెట్కీపర్ అభిజ్ఞాన్ కుండు 42 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అమెరికా బౌలర్లలో రిత్విక్ రెండు వికెట్లు సాధించగా, రిషబ్ షింపి ఒక వికెట్ తీసాడు. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత జట్టు తమ తదుపరి మ్యాచ్లో జనవరి 17న బంగ్లాదేశ్తో తలపడనుంది.
మరిన్నివార్తలుచదవండి: మిచెల్ స్టార్క్కు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు
తరచుగా అడిగే ప్రశ్నలు
భారత్ అమెరికా జట్టుపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ జనవరి 17న బంగ్లాదేశ్తో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.