అన్ని

బంగ్లాదేశ్‌లో హిందూ వితంతువుపై దాడి... “మనసు కలచివేసింది” అన్న ధావన్

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దారుణాలు మరోసారి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. తాజాగా అక్కడ ఒక హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించిన ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ అమానుష ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా స్పందించారు.

ఈ కిరాతక ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ధావన్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. “బంగ్లాదేశ్‌లో ఒక హిందూ వితంతువుపై జరిగిన క్రూరమైన దాడి గురించి చదివి నా మనసు కలత చెందింది. ఎక్కడైనా, ఎవరి మీదైనా ఇలాంటి హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేం. బాధితురాలికి న్యాయం జరగాలని, ఆమెకు తగిన రక్షణ, మద్దతు లభించాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ నుంచి హింసాత్మక ఘటనలు గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే కనీసం ఆరుగురు హిందూ పురుషులు దారుణంగా హత్యకు గురయ్యారని సమాచారం. మృతుల్లో వ్యాపారులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. వీరిని కాల్చడం, కత్తులతో పొడిచి చంపడం వంటి భయంకర ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇప్పటికే మైనారిటీల్లో భయాన్ని రేపుతున్న ఈ పరిస్థితుల్లో, తాజాగా జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటన మరింత కలకలం రేపింది. మానవ హక్కుల సంఘాల అంచనాల ప్రకారం, ఇటీవలి కాలంలో వందలాది హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. అనేక చోట్ల ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి, లూటీకి గురయ్యాయి.

గతేడాది జూలైలో సింగపూర్‌లో జరిగిన తిరుగుబాటుకు సంబంధించి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మొదలైంది. ఆ తరువాత నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడం, శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడం గమనార్హం.

ఈ రాజకీయ అశాంతిని అవకాశంగా మలుచుకున్న మతోన్మాద శక్తులు హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం పరిస్థితిని నియంత్రించడంలో విఫలమైందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడి మైనారిటీలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

శిఖర్ ధావన్ వ్యాఖ్యలకంటే ముందే పలువురు క్రీడాకారులు, ప్రముఖులు బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ కోసం గళమెత్తారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఐపీఎల్‌ సహా ఇతర క్రికెట్ లీగ్స్ నేపథ్యంలో భారత్–బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ధావన్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. క్రీడాకారులు కేవలం ఆటకే పరిమితం కాకుండా, సామాజిక అన్యాయాలపై స్పందించడం పట్ల నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు చదవండి: టీ20 వరల్డ్ కప్ 2026: బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదిక మార్పును తిరస్కరించిన ఐసీసీ

 

LastModified Date: 2026-01-08 01:55:16

తరచుగా అడిగే ప్రశ్నలు

Q. బంగ్లాదేశ్ ఘటనపై శిఖర్ ధావన్ ఏమన్నారు?
A.

హిందూ వితంతువుపై జరిగిన దాడి తన మనసును కలచివేసిందని, బాధితురాలికి న్యాయం జరగాలని శిఖర్ ధావన్ తెలిపారు.

Krishna R
Krishna R

I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.

నవీకరణలు