ఇప్పటికే మైనారిటీల్లో భయాన్ని రేపుతున్న ఈ పరిస్థితుల్లో, తాజాగా జరిగిన గ్యాంగ్రేప్ ఘటన మరింత కలకలం రేపింది. మానవ హక్కుల సంఘాల అంచనాల ప్రకారం, ఇటీవలి కాలంలో వందలాది హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. అనేక చోట్ల ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి, లూటీకి గురయ్యాయి.
గతేడాది జూలైలో సింగపూర్లో జరిగిన తిరుగుబాటుకు సంబంధించి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత మొదలైంది. ఆ తరువాత నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడం, శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడం గమనార్హం.
ఈ రాజకీయ అశాంతిని అవకాశంగా మలుచుకున్న మతోన్మాద శక్తులు హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం పరిస్థితిని నియంత్రించడంలో విఫలమైందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడి మైనారిటీలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
శిఖర్ ధావన్ వ్యాఖ్యలకంటే ముందే పలువురు క్రీడాకారులు, ప్రముఖులు బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం గళమెత్తారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఐపీఎల్ సహా ఇతర క్రికెట్ లీగ్స్ నేపథ్యంలో భారత్–బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ధావన్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. క్రీడాకారులు కేవలం ఆటకే పరిమితం కాకుండా, సామాజిక అన్యాయాలపై స్పందించడం పట్ల నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి: టీ20 వరల్డ్ కప్ 2026: బంగ్లాదేశ్ మ్యాచ్ల వేదిక మార్పును తిరస్కరించిన ఐసీసీ
