టీ20 ప్రపంచకప్ 2026: మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్టు ప్రకటింపు

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్కు సంబంధించి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన న్యూజిలాండ్ జట్టును జనవరి 7న అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ను ఎంపిక చేసింది.
ఉపఖండపు పిచ్ల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని న్యూజిలాండ్ స్పిన్ బలమైన జట్టును ఎంపిక చేసింది. సాంట్నర్తో పాటు మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్రలతో కలిపి మొత్తం నలుగురు స్పిన్నర్లకు చోటు కల్పించింది. భారత్, శ్రీలంకలోని నెమ్మదైన పిచ్లపై స్పిన్ కీలకంగా మారనుందన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ జట్టులో మరో విశేషం ఏమిటంటే, ఆర్సీబీ స్టార్ పేసర్, గత ఏడాది అత్యధిక వికెట్లు తీసిన జేకబ్ డఫీకి తొలిసారి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం. కైల్ జేమిసన్ను ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపిక చేశారు. అనుభవజ్ఞులైన ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
అయితే లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ పితృత్వ సెలవుల కారణంగా ప్రపంచకప్లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. వీరిద్దరూ ఇటీవల గాయాల నుంచి కోలుకుంటున్నారు. అలాగే ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్ కూడా గాయాల నుంచి పూర్తిగా కోలుకునే దశలోనే ఉన్నారు.
ప్రపంచకప్లో న్యూజిలాండ్ గ్రూప్–డిలో పోటీ పడనుంది. ఈ గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా, సౌతాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఆడనుంది.
ప్రపంచకప్కు ముందు న్యూజిలాండ్ జట్టు భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్లలో తలపడనుంది. ఇందులో భాగంగా జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే వడోదరలో జరగనుండగా, రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్లో, మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరుగుతాయి.
అనంతరం జనవరి 21 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ టీ20 మ్యాచ్లు జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్పూర్, రాయ్పూర్, గౌహతి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా జరుగనున్నాయి. ఈ టీ20 సిరీస్లో పాల్గొన్న జట్టులో నుంచి నలుగురు ఆటగాళ్లను మార్చి తుది ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
టీ20 ప్రపంచకప్కు న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధీ.
ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ జేమిసన్
మరిన్ని వార్తలు చదవండి: జోష్ హేజిల్వుడ్ త్వరలో BBL రిటర్న్, ఐపీఎల్ 2026కు ముందు RCBకు ప్లస్ పాయింట్
తరచుగా అడిగే ప్రశ్నలు
టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.