టీ20 ప్రపంచకప్ 2026: పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టు ప్రకటింపు.. కెప్టెన్గా సల్మాన్ ఆఘా

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్కు సంబంధించి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన ప్రొవిజనల్ జట్టును ఇవాళ జనవరి 4న ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా సల్మాన్ అలీ ఆఘాను ఎంపిక చేశారు. అయితే ఈ జట్టుకు డిప్యూటీ లేదా వైస్ కెప్టెన్ను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.
ఫామ్లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్కు ఎట్టకేలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అలాగే, స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది కూడా జట్టులో కొనసాగుతున్నాడు. అయితే అతని ఫిట్నెస్పై ఇప్పటికీ అనిశ్చితి నెలకొంది. ఇటీవల బిగ్బాష్ లీగ్లో ఆడుతున్న సమయంలో షాహీన్ మోకాలి గాయానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనికి బ్యాకప్గా మరో పేసర్ హారిస్ రౌఫ్ను జట్టులో చేర్చారు.
ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ రీఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే, వికెట్కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్కు ఈ ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో ఉస్మాన్ ఖాన్ను ప్రధాన వికెట్కీపర్గా ఎంపిక చేశారు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ పూర్తయ్యాక, అంటే జనవరి 11 తర్వాత పాకిస్తాన్ మెయిన్ స్క్వాడ్ను ప్రకటించనున్నారు.
టీ20 ప్రపంచకప్కు పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టు
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్)
బాబర్ ఆజమ్
షాహీన్ అఫ్రిది (ఫిట్నెస్పై అనిశ్చితి)
ఉస్మాన్ ఖాన్ (వికెట్కీపర్)
షాదాబ్ ఖాన్
మొహమ్మద్ నవాజ్
ఫహీమ్ అష్రఫ్
హారిస్ రౌఫ్ (షాహీన్కు బ్యాకప్)
ఫకర్ జమాన్
మొహమ్మద్ వసీం జూనియర్
నసీం షా
అబ్దుల్ సమద్
సాహిబ్జాదా ఫర్హాన్
సైమ్ అయూబ్
సల్మాన్ మీర్జా
అబ్రార్ అహ్మద్
కాగా, టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ గ్రూప్-ఏలో పోటీపడనుంది. ఇదే గ్రూప్లో టీమిండియా కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. ఈ గ్రూప్లోని ఇతర జట్లుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్తో పాకిస్తాన్ తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మధ్య దాయాదుల సమరం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది.
మరిన్నివార్తలుచదవండి: టీ20 వరల్డ్ కప్ 2026 వివాదం: భారత్లో ఆడమంటూ బంగ్లాదేశ్ నిరాకరణ? ‘అంత ఈజీ కాదు’ అంటున్న BCCI
తరచుగా అడిగే ప్రశ్నలు
పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టుకు సల్మాన్ అలీ ఆఘాను కెప్టెన్గా నియమించారు.
ప్రొవిజనల్ జట్టులో భాగంగా జట్టు కాంబినేషన్ కారణంగా రిజ్వాన్కు చోటు దక్కలేదని తెలుస్తోంది. తుది జట్టును శ్రీలంకతో టీ20 సిరీస్ అనంతరం ప్రకటిస్తారు.
I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.