టీమిండియాకు గాయాల ఆందోళన.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో రియాన్ పరాగ్కు అవకాశం

న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ను సొంతం చేసుకుంది. ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే వరుసగా మూడు విజయాలతో 3-0 ఆధిక్యంలో నిలిచి తన సత్తాను చాటింది. టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా సాగుతున్న ఈ సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో సూర్యకుమార్ యాదవ్ సేన ముందుకు సాగుతోంది.
అయితే, మెగా టోర్నీకి ముందు గాయాల సమస్య టీమిండియాకు ఆందోళనగా మారింది. ఇప్పటికే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరమయ్యాడు. అలాగే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా వేలునొప్పితో బాధపడుతున్నాడు.
రేసులోకి ఊహించని ఆటగాడు
వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా రెండు వారాలకు పైగా సమయం పట్టవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అతడు ప్రపంచకప్కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీమిండియా యాజమాన్యం అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
భుజం నొప్పితో రిహ్యాబ్లో పరాగ్
ప్రస్తుతం రియాన్ పరాగ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాస చికిత్స పొందుతున్నాడు. భుజం నొప్పితో గత మూడు వారాలుగా రిహ్యాబ్ చేస్తున్న అతడు, గతేడాది డిసెంబర్ 6 తర్వాత నుంచి ఎలాంటి పోటీ మ్యాచ్ల్లో పాల్గొనలేదు. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లకు కూడా అతడు అందుబాటులో లేకపోయాడు.
అయితే తాజా సమాచారం ప్రకారం, పరాగ్ వేగంగా కోలుకుంటున్నాడు. నెట్స్లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తూ ఎలాంటి నొప్పి లేకపోవడం సానుకూలంగా మారింది. జనవరి 28 మరియు 30 తేదీల్లో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనున్నట్లు తెలుస్తోంది. జనవరి 31న అతడికి ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారులు పరాగ్ ఫిట్నెస్పై ఆరా తీసి, ఫిబ్రవరి 2న అతడిని స్టాండ్బై ప్లేయర్గా టీమిండియాతో కలిసి ముంబైకి పిలిచినట్లు సమాచారం.
వాషీ దూరమైతే పరాగ్కు ఛాన్స్
ఒకవేళ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోకపోతే, అతడి స్థానంలో రియాన్ పరాగ్ను ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేసే అవకాశం ఉంది. గువాహటికి చెందిన 24 ఏళ్ల రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. కుడిచేతి బ్యాటర్ అయిన అతడు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు.
2024లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన పరాగ్, చివరగా శ్రీలంక పర్యటనలో వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 9 టీ20 మ్యాచ్ల్లో 106 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు. ఒక్క వన్డే మ్యాచ్లో 15 పరుగులు చేసి మూడు వికెట్లు సాధించాడు.
మరిన్నివార్తలుచదవండి: రెడ్ హ్యాండెడ్ ఆరోపణలు.. స్మృతి మంధాన పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం
తరచుగా అడిగే ప్రశ్నలు
గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
జనవరి 31న రియాన్ పరాగ్కు ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. క్లియరెన్స్ లభిస్తే అతడిని స్టాండ్బై ప్లేయర్గా ఎంపిక చేయవచ్చు.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.