SMAT 2025–26: కెప్టెన్గా సంజూ శాంసన్… కానీ గ్రూప్ దశ వరకు మాత్రమే!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025–26 కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ సారి జట్టుకు సంజూ శాంసన్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రాబోయే టీ20 ప్రపంచకప్ 2026ను దృష్టిలో పెట్టుకుని ఈ దేశవాళీ టోర్నమెంట్ను పూర్తిగా ఉపయోగించుకోవాలని సంజూ భావిస్తున్నాడు.
అయితే, టోర్నమెంట్ మొత్తం శాంసన్ అందుబాటులో ఉండకపోవచ్చు. అతను గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల వరకు మాత్రమే ఆడనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 26న ప్రారంభమయ్యే SMAT లీగ్ దశ డిసెంబర్ 8తో ముగియనుంది. ఆ వెంటనే డిసెంబర్ 9 నుంచి భారత్–దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది, అందులో సంజూ శాంసన్ పాల్గొనాల్సి ఉంటుంది.
సంజూ గైర్హాజరీలో మహ్మద్ ఇమ్రాన్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపడతాడు. కేరళ జట్టు తమ తొలి మ్యాచ్లో నవంబర్ 26న లక్నో వేదికగా బరిలో దిగనుంది. ఈ జట్టులో రోహన్ ఎస్ కున్నుమ్మల్, మహ్మద్ అజర్ుద్దీన్ వంటి అగ్రెసివ్ బ్యాటర్లు ఉన్నారు.
ఇక మరోవైపు, ఐపీఎల్ 2026లో సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మినీ వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ రాజస్తాన్ శాంసన్ను రూ. 18 కోట్లకే సీఎస్కేకు ట్రేడ్ చేసింది. దాని బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్లను సీఎస్కే వదులుకుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం కేరళ జట్టు:
సంజూ శాంసన్ (కెప్టెన్), రోహన్ ఎస్ కున్నుమ్మల్, మహ్మద్ అజరుద్దీన్, మహ్మద్ ఇమ్రాన్ (వైస్ కెప్టెన్), విష్ణు వినోద్, నిధీష్ ఎం.డి., ఆసిఫ్ కె.ఎం., అఖిల్ స్కారియా, బిజు నారాయణన్ ఎన్, అంకిత్ శర్మ, కృష్ణ దేవన్ ఆర్.జె., అబ్దుల్ బాజిత్ పి.ఎ., షరఫుద్దీన్ ఎన్.ఎం., సిబిన్ వి, ప్రసాద్, సల్మాన్ నిజార్.
మరిన్ని వార్తలు చదవండి: టీ20 ప్రపంచకప్ 2025: ఆస్ట్రేలియాపై ఘన విజయం తో ఫైనల్కు భారత్!
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.