స్టీవ్ స్మిత్ 37వ టెస్ట్ సెంచరీ, యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో అద్భుత సెంచరీతో మెరిశాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో ఇది అతనికి 37వ సెంచరీ కాగా, ఇంగ్లండ్పై 13వది. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 49వ శతకంగా నిలిచింది.
సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి స్టీవ్ స్మిత్ 129 పరుగులతో అజేయంగా క్రీజ్లో నిలిచాడు. అతనికి జతగా బ్యూ వెబ్స్టర్ 42 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్పై 134 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ కూడా చెలరేగిపోయాడు. అతను 163 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. మిగతా బ్యాటర్లలో వెదర్లాడ్ 21, లబూషేన్ 48, మైఖేల్ నెసర్ 24, కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా 17, అలెక్స్ క్యారీ 16, గ్రీన్ 37 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3 వికెట్లు, స్టోక్స్ 2 వికెట్లు తీసుకోగా, టంగ్ మరియు బేతెల్ తలో వికెట్ సాధించారు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులు చేసింది. జో రూట్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకోగా, హ్యారీ బ్రూక్ 84 పరుగులతో అర్ధ సెంచరీ చేసి రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైఖేల్ నెసర్ 4 వికెట్లు పడగొట్టగా, స్టార్క్ మరియు బోలాండ్ తలో 2 వికెట్లు తీశారు. గ్రీన్ మరియు లబూషేన్ ఒక్కొక్క వికెట్ సాధించారు.
ఇప్పటికే ఐదు మ్యాచ్ల యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
మరిన్నివార్తలుచదవండి: అంబటి రాయుడు మరోసారి తండ్రి... మగ బిడ్డతో కుటుంబంలో ఆనందం
తరచుగా అడిగే ప్రశ్నలు
స్టీవ్ స్మిత్ టెస్టుల్లో ఇప్పటివరకు 37 సెంచరీలు చేశాడు.
ఐదు మ్యాచ్ల యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో ఇప్పటికే గెలుచుకుంది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.