యశస్వి జైస్వాల్ మెరుపు సెంచరీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ఘన విజయం

టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ లేమితో జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, జట్టు నుంచి దూరంగా ఉన్న యువ సంచలనం యశస్వి జైస్వాల్ తన బ్యాటింగ్తో సంచలన ప్రదర్శన చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానాతో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీతో ముంబై జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన జైస్వాల్, ముంబై తరఫున ఆడుతూ కేవలం 48 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్లో అతడు ఒక సిక్స్తో పాటు 16 ఫోర్లు బాదాడు. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాల్సిన ఒత్తిడితో కూడిన మ్యాచ్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం విశేషం.
జైస్వాల్ బ్యాటింగ్కు దిగగానే హర్యానా బౌలర్లపై దాడి మొదలుపెట్టాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన అతడు, ఆ తర్వాత మరో వేగంతో పరుగులు తీస్తూ 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. శతకం సాధించే క్రమంలో ఏడు బంతులను డాట్గా ఎదుర్కొన్నప్పటికీ, 48 బంతుల్లోనే శతకం నమోదు చేయడం అతడి అసాధారణ ప్రతిభకు నిదర్శనం.
ఇది టీ20 ఫార్మాట్లో యశస్వి జైస్వాల్కు నాల్గవ సెంచరీ కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడికి ఇదే తొలి శతకం. ఈ మ్యాచ్లో జైస్వాల్ 101 పరుగులతో అజేయంగా నిలవగా, ముంబై జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై కేవలం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ను ముగించింది. జైస్వాల్కు తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా 25 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టుకు కీలకంగా నిలిచాడు.
ఈ అద్భుతమైన సెంచరీతో యశస్వి జైస్వాల్ భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు తన బ్యాట్తో గట్టి సమాధానం చెప్పాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ, అతడికి నిరంతర అవకాశాలు దక్కడం లేదు. అతని స్థానంలో ఈ ఫార్మాట్లో పదేపదే విఫలమవుతున్న శుభ్మన్ గిల్తో ఓపెనింగ్ చేయించడం విమర్శలకు దారితీస్తోంది.
టీ20 అంతర్జాతీయాల్లో యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు 23 మ్యాచ్లలో 36.16 సగటుతో 723 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. రాబోయే టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు యశస్వికి తప్పకుండా అవకాశం ఇస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు దీపక్ హుడాకు షాక్, బౌలింగ్ నిషేధ భయం
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.