వరల్డ్ కప్ స్క్వాడ్లో ప్లేస్ ఫిక్స్! రోహిత్, కోహ్లీ విధ్వంసం చూశారా?

విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దుమ్మురేపారు. ఎన్నో ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ఇద్దరు దిగ్గజాలు, తొలి మ్యాచ్లోనే సెంచరీలతో తమ క్లాస్ ఏంటో మరోసారి నిరూపించారు.
ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ, బుధవారం డిసెంబర్ 24న సిక్కింను ఎదుర్కొన్న మ్యాచ్లో అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో 155 పరుగులు చేసి హిట్మ్యాన్ తన దూకుడైన బ్యాటింగ్కు మరో ఉదాహరణ చూపించాడు. రోహిత్ సెంచరీతో కదం తొక్కిన ముంబై, సిక్కింను సులువుగా ఓడించి ఘన విజయం సాధించింది.
సౌతాఫ్రికా ఫామ్ను కొనసాగించిన కోహ్లీ
దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన విరాట్ కోహ్లీ, అంతకుముందు దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలతో చూపిన సూపర్ ఫామ్ను ఇక్కడ కూడా కొనసాగించాడు. బుధవారం డిసెంబర్ 24న బెంగుళూరు వేదికగా ఆంధ్రప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ శతకంతో చెలరేగాడు.
తనకు ఎంతో ఇష్టమైన చేజింగ్లో సెంచరీ సాధించిన కోహ్లీ, ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. ఈ శతకం లిస్ట్ ఏ క్రికెట్లో విరాట్ కోహ్లీకి 58వ సెంచరీగా నిలిచింది.
మరో అరుదైన రికార్డు
ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో కోహ్లీకి ముందుగా భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నారు. సచిన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 21,999 పరుగులతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
వీళ్లకు తిరుగే లేదు.. వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు ఖాయం
కోహ్లీ, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టెస్ట్ మరియు టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్కే పరిమితమైన ఈ ఇద్దరూ, బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ ఆటగాళ్లు కనీసం రెండు దేశవాళీ మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నారు.
చాలా ఏళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినప్పటికీ, నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా తమకు తేడా లేదన్నట్లుగా బ్యాట్తో చెలరేగిపోయారు. తొలి మ్యాచ్లోనే తమ తమ జట్లకు శతకాలతో ఘన విజయాలు అందించారు.
కోహ్లీ, రోహిత్ సెంచరీలతో రోకో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక వీళ్లకు తిరుగే లేదు, 2027 వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్లో ప్లేస్ ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వార్తలు చదవండి: భారత్ పర్యటనలో కివీస్ కొత్త ముఖాలు.. పూర్తి స్క్వాడ్స్ వివరాలు
తరచుగా అడిగే ప్రశ్నలు
బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు అందుబాటులో లేని సమయంలో కనీసం రెండు దేశవాళీ మ్యాచ్లు ఆడాలి. అందుకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నారు.
చాలా ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినా, ఇద్దరూ తొలి మ్యాచ్ల్లోనే సెంచరీలు సాధించి తమ జట్లకు ఘన విజయాలు అందించారు.
I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.